స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అని చెప్పవచ్చు. ఇక ఈయన సినిమా అంతే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం బయ్యర్లకు తప్పకుండా వుంటుంది. అయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ"పుష్ప". ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్ కి. అంతే కాదు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఏంటో చూద్దాం.

పుష్ప టీజర్ కు ఇటీవల అనూహ్యమైన స్పందన రావడంతో ఈ మూవీతోనే అల్లు అర్జున్  స్టైలిష్ స్టార్ ను  కాస్త, సుకుమార్ ఐకాన్ స్టార్ గా టీజర్ లో పేరు మార్చి  విడుదల చేశారు. అల్లు అర్జున్ ని అలా ఎందుకు అన్నారో.. మీరు సినిమా చూస్తే తెలుస్తుందని తెలిపారు సుకుమార్ గారు. అయితే ఇక టైటిల్ విషయంపై ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ పై సుకుమార్ గారు చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారని తెలిపాడు.


ఇక పుష్పా సినిమా మొదటి పార్ట్ -1 కి "పుష్ప.. ది రైజర్ "అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండవ భాగానికి ఒక అద్భుతమైన టైటిల్ ని ఫిక్స్ చేశారట.. అయితే త్వరలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడవుతాయి.. ఈ మూవీలో  కథ ఎర్రచందనంతో ముడిపడి ఉండటం, అంతేకాకుండా ఈ సినిమాకి రాజకీయ అంశాలు తోడవడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరిలోనూ ఇదే ఆలోచన.

ఇక ఈ సినిమా లోని మొదటి భాగం ఈ సంవత్సరం చివరిలో కానీ, 2022 లో సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మిగిలిన రెండో భాగం 2023 లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: