మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్.. కోలీవుడ్ హీరో సూర్య ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో ఓ వార్త వినిపిస్తుంది. కాని ఆ కాంబో సినిమా ఇంతవరకు రాలేదు. త్రివిక్రం మన స్టార్స్ తోనే సినిమాలు చేస్తున్నాడు. సూర్య కూడా తమిళంలో వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడని తెలిసిందే. అయితే విజయ్ అలా సినిమా కన్ ఫాం చేశాడో ఏదో సూర్య కూడా బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని టాక్.

బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్యతో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే బోయపాటి సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమాను లైన్ లో పెడుతున్నాడట సూర్య. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ కాంబోని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. త్రివిక్రం సెల్యులాయిడ్ లో సూర్య లాంటి మల్టీ టాలెంటెడ్ హీరో సినిమా చేస్తే ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఫ్యామిలీ, ఎమోషనల్ సబ్జెక్ట్ తో వస్తుందని చెప్పొచ్చు. అయితే ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉంటున్న ఈ కాంబో ఈసారైనా పట్టాలెక్కుతుందా లేక ఈసారి కూడా వార్తల్లోనే ఆగిపోతుందా అన్న్నది చూడాలి. తప్పకుండా సూర్యతో త్రివిక్రం మరోసారి తన మ్యాజిక్ ఏంటన్నది చూపిస్తాడని అంటున్నారు. సినీ లవర్స్ కూడా ఈ కాంబోపై అమితాశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రం మహేష్ తో సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. మహేష్ సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. త్రివిక్రం కూడా మహేష్ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: