.

ఒకప్పుడు మన సినీ ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా వంద కోట్లు వసూలు చేసింది అంటే, కచ్చితంగా రికార్డులోకి ఎక్కేది. కానీ ఇటీవల కథ అందుకు పూర్తిగా విరుద్ధం. తెలుగు స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీలు చేస్తుండడంతో, ఇక సినిమా బడ్జెట్ కూడా లెక్కలు మారుతోంది. దాదాపుగా 500 నుండి 600 కోట్ల రూపాయలకు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. కానీ బడ్జెట్ కు తగ్గట్టుగా వసూళ్లు వస్తాయో, లేదో తెలియదు కానీ అంతే స్థాయిలో మన హీరోల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయంలో ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను  సంపాదించుకున్న ఏకైక హీరో అని చెప్పవచ్చు. ఆరడుగుల అందంతో, నటనతో, ఆహార్యంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో కూడా ఇతనే. ఇక అందులో భాగంగానే ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలను అందుకుంటున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఇందుకు సాక్ష్యం ఈయన తీయబోతున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సినిమాకి, ఇండియాలోని ఎక్కువ పేమెంట్ అందుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించారు.
ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు తమిళ్ దళపతి విజయ్. విజయ్ దళపతి నటించబోతున్న 66 వ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో, ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశం చేస్తున్నారు. ఈయన ఇదివరకు మాస్టర్ సినిమాను నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ చేసి, రూ. మూడు వందల కోట్లకు పైగా షేర్ ను వసూలు చేశారు. ఇక  కోలీవుడ్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా విజయ్ వంద కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే  గనుక  జరిగితే మన సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ని ఢీకొట్టే ఏకైక హీరో విజయ్ మాత్రమే అవుతాడు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: