ప్రస్తుతం ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల శివ దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ని ఆర్ఆర్ ఆర్అనే సినిమాను పూర్తి చేసుకొని కొరటాలతో జాయిన్ అవుతాడు. అయితే దర్శకుడు నిర్మాణ రంగంలోకి రావడం కొంత వరకు చాలా మందికి కొత్త గా అనిపిస్తుంది అలాంటిది  దర్శకుడు కొరటాల శివ నిర్మాణ రంగంలోకి రావడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని అనిపించింది. ఇటీవలె కొరటాల శివ సమర్పణ లో ఓ సినిమా ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కోమల పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వి వి గోపాలకృష్ణ దర్శకుడు గా టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు భగవద్గీత సాక్షిగా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేరుతో ఓ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్లో చర్చ నడిచింది. దీని దర్శకుడు చాలా చోట్ల ఈ కథ వినిపించాడట. ఒక దశలో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడు. తర్వాత ఆ కథ వేరే కాంపౌండ్ లో తిరిగింది. సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపాడు. సినిమా మొదలు కావడమే ఆలస్యం అని ప్రచారం జరిగింది.

కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు తేజు. చివరికి సత్యదేవ్ హీరోగా ఎంపిక అయ్యారు. కొరటాల శివ లాంటి పేరు ఉన్నది రచయిత దర్శకుడు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా అవబోతుందని తెలుస్తోంది. ఈ స్టోరీ రెవల్యూషనరీ గా ఉంటుందని ముగింపు అందర్నీ షాక్ కి గురి చేస్తుందని అంతర్గత వర్గాల సమాచారం. సుశాంత్ సినిమా ఇచ్చిన వాహనాలు నిలుపరాదు పనిచేసిన సురేష్ బాబా అనే యువ రచయిత ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు. మంచి కథ పడితే దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే కథా నాయకుడు సత్యదేవ్ ఇందులో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: