టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాధే శ్యామ్'.ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అసలు ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు.ఇంకా అతి కొద్ది రోజుల్లోనే ఈ షూటింగ్ పూర్తి కానుంది.అయినా కూడా మేకర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు.ఒకవైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఇప్పటినుంచే ప్రమోషన్ షురూ చేస్తూ..సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్తుంటే..ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం రాధే శ్యామ్ విషయంలో నిరాశ తప్పడం లేదు.

అయితే రాధే శ్యామ్ మినహా ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాల అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి.కానీ రాధే శ్యామ్ మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.అక్టోబర్ లో విడుదలయ్యే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దాదాపు మూడు నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలెట్టేసారు మేకర్స్.ఈ నేపథ్యంలో ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ టీమ్ కనీసం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ఇస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రమోషన్ చేయకుండా సినిమాని రిలీజ్ చేస్తే సినిమా సక్సెస్ కావడం కష్టమని చెప్తున్నారు అభిమానులు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ అనేవి సరైన రీతిలో లేకుంటే ఆ ప్రభావం రేపు సినిమా కలెక్షన్స్ మీద పడే అవకాశం ఉంది.అందుకే ప్రభాస్ ఇప్పటికైనా ప్రమోషన్స్ విషయంలో దృష్టి సారించాలి.ఇక ఈ సినిమా కొత్త విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.రాధే శ్యామ్ నుంచి అప్డేట్స్ వస్తే యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని భావిస్తున్నారు ప్రభాస్ అభిమానులు.అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ని చూసి నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ.. రాధే శ్యామ్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇప్పటికైనా రాధే శ్యామ్ మేకర్స్ నుంచి సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: