యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన "రాధేశ్యామ్" అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "సలార్", బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మిథలాజికల్ మూవీ "ఆదిపురుష్" షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ లో నటించాల్సి ఉంది. ప్రభాస్ ఇలా నాలుగు వేర్వేరు జోనర్లకు సంబంధించిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఇప్పటికే పూర్తి కావాల్సిన "రాధేశ్యామ్" మరింత ఆలస్యమైంది. దీంతో ప్రభాస్ ముందుగా "రాధేశ్యామ్"ను పూర్తి చేయాలనుకుంటున్నాడని, ఆ తరువాతే మరో ప్రాజెక్ట్ గా దృష్టి సారిస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల ప్రభాస్ ఇటలీ పర్యటన వెనుక అసలైన కారణం ఏంటో తెలీదు కానీ "రాధేశ్యామ్" షూటింగ్ కోసమేనేమో అనే డౌట్ ఉంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే "ఆదిపురుష్" షూటింగ్ ప్రారంభమైంది.

తాజాగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మెగా బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ సంతకం చేసిన ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ టాప్ నటీనటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ రోజు అధికారికంగా ప్రారంభమవుతుంది. అమితాబ్ బచ్చన్ పై సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు చిత్రీకరించబడతాయి. ఈ షెడ్యూల్ ఒక వారం పాటు ఉంటుంది. ప్రభాస్, దీపికా పదుకొనే సెట్స్‌లో చేరనున్నారు. పూజా వేడుకలో ప్రభాస్ పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ కోసమే అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. వైజయంతి మూవీస్ 2023లో థియేటర్లలో విడుదల కానున్న ఈ పెద్ద బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషలలో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: