నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాలను ఓకే చేయడంలో ఎంతో ఫాస్ట్ గా ఉన్నాడు. బోయపాటి శ్రీను తో తన మూడో సినిమా అయినా అఖండ సినిమా చివరి దశలో ఉండగానే ఆయన వరుస సినిమాలు ఒప్పుకోవడం ఇప్పుడు నందమూరి అభిమానులు ఎంతగానో సంతోషపరుస్తుంది. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే వచ్చిన టీజర్ లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఇటీవలే రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు బాలకృష్ణ కోసం మరో మాస్ మసాలా చిత్రం రెడీ చేశాడుం మంచి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తన కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా మిగిలిపోతుంది అని అంటున్నారు. గతంలో వీరిద్దరూ పనిచేయకపోవడం హిట్ జోష్ లో ఉన్న దర్శకుడు కావడంతో బాలకృష్ణ తో చేసే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇక బాలకృష్ణ మరో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ సినిమా రాగా ఆ సినిమా చేస్తున్న సమయంలోనే పూరిజగన్నాథ్ త్వరలోనే తన తదుపరి సినిమా బాలయ్య బాబుతో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇద్దరికీ వరుస కమిట్మెంట్ లు ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ చేస్తున్న లైగర్ సినిమా పూర్తి కావడంతో బాలకృష్ణ సినిమా పై దృష్టి సారించారు పూరీ. పూరి ఉత్సాహం గమనించిన బాలకృష్ణ గోపీచంద్ తర్వాత అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా నీ వెనక్కినట్టి మరి పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: