ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్". భారీ బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్, లాల్, రెహమాన్ వంటి దిగ్గజ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. "పొన్నియన్ సెల్వన్‌ను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్‌ల క్రింద అల్లిరాజా సుబస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవివర్మన్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్, శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమా ఎడిటింగ్ చూసుకుంటున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ ఒక కత్తిని కలిగి ఉన్న సరికొత్త రాయల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దానిపై పులి ముఖం గర్జిస్తోంది. ఈ మాగ్నమ్ ఓపస్ మొదటి భాగం 2022 లో విడుదలకు సిద్ధంగా ఉందని మేకర్స్ ధృవీకరించారు.

ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చేశాయి. "మారి 2", "సేతుపతి" ఫేమ్ నటుడు, చైల్డ్ స్టార్‌గా నటించిన మాస్టర్ రాఘవన్ మురుగన్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇటీవల చేసిన పోస్ట్‌లో ఐశ్వర్య రాయ్‌తో కొన్ని సెల్ఫీలు పంచుకున్నారు. అంతే కాదు అతను అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ సెషన్ లోనే ఐశ్వర్య 'నందిని' పాత్రను, రాఘవన్ 'పాండియా ప్రిన్స్' చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నట్టు వెల్లడించారు. దివంగత రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ నవల "పొన్ని సెల్వన్" ఆధారంగా మణిరత్నం "పొన్నియన్ సెల్వన్"ను తెరకెక్కిస్తున్నాడు. సినిమాపై అంచనాలు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. దాదాపు తమిళ స్టార్ హీరోలు అందరూ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. ఈ సినిమా త్వరగా విడుదల కావాలని మణిరత్నం అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: