మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. వాటిల్లో అతడు విజయం అందుకోగా.. ఖలేజా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా వున్నారు మహేష్ బాబు.ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుకు సెప్టెంబర్ లో గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

అయితే తాజాగా ఇండ్రస్ట్రీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాకి క్లాప్ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది.సినీ వర్గాల వారు,మహేష్ బాబు సన్నిహితులు తెలిపిన ప్రకారం..   త్రివిక్రమ్ సినిమాకి మహేష్ బాబు ఏకంగా 75 రోజుల పాటు వర్క్ చేయబోతున్నారు.అంతేకాదు త్రివిక్రమ్ సినిమాని కంటిన్యూగా 75 రోజుల్లో ముగిస్తాడట మహేష్. అక్టోబర్ నెలలో ఈ సినిమాని ఒక కొలిక్కి తెచ్చి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఎందుకంటే మహేష్ బాబు వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది.సినిమా స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తయినట్లే. అందుకే త్రివిక్రమ్ సినిమాని కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేసి..రాజమౌళి సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట మహేష్. ఇక ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు.సినిమాలో మహేష్ రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటించింది.యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: