మన తెలుగు సినిమాలకు పెద్ద సీజన్ ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా 'సంక్రాంతి పండుగ సీజన్' అనే చెప్పాలి.ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో అగ్ర హీరోలు తన సినిమాలతో పోటీ పడుతుంటారు.సంక్రాంతి రేస్ అనేది హీరోల మధ్య ఎప్పుడూ రసవత్తరంగానే జరుగుతుంది.అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ మాత్రం పెద్దగా ఆసక్తికరంగా సాగలేదు. దానికి ప్రదాన కారణం కరోనా మహమ్మారి.ఈ వైరస్ వల్లఏకంగా సినీ ఇండ్రస్టీనే మూత పడింది.అయితే రాబోయే సంక్రాంతి సీజన్ ఓ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.వచ్చే సంక్రాంతికి రాబోయే సినిమాలు అలాంటిలాంటి సినిమాలు కావు.ఇంతకీ సంక్రాంతి కి ఎవరెవరు వస్తున్నారు..

 ఆ సినిమాల వివరాల్లోకి వెళ్తే.. ముందుగా సంక్రాంతి బరిలో దిగనున్నాడు భీమ్లా నాయక్.తాజాగా అయ్యప్పనున్ కోషియం రీమేక్ నుండి ఓ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేస్తూ 'భీమ్లా నాయక్ సంక్రాంతి కి వస్తాడు' అని చెప్పేసారు.ఇక మరో అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తాను నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాని సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఇక ఈ రెండు సినిమాలు కాకుండా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్3' ని కూడా అప్పుడే విడుదల చేయాలని అనుకుంటున్నారట.ఒకవేళఅదే కనుక జరిగితే ఈ సారి సంక్రాంతి కి బాబాయ్ పవన్ వర్సెస్ అబ్బాయి వరుణ్ తేజ్ అన్నట్లుగా పోటీ ఉండబోతోంది.

అయితే ఇక్కడ మరో డౌట్ ఏంటంటే..సంక్రాంతి కి వచ్చే సినిమాలు రెండా?లేక మూడా?అని.. ఎందుకంటే మహేష్ సర్కారు వారి పాటను సంక్రాంతికి తీసుకొస్తున్నామని మూవీ యూనిట్ సినిమా మొదలైనప్పుడు చెప్పింది.కానీ కరోనా వలన అనుకున్నట్లుగా ఈ సినిమా షూటింగ్ జరగలేదు.దీంతో షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక దానికి సంబంధించి ఆగస్టు 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: