ఎనర్జిటిక్ స్టార్ కాస్త ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఉస్తాద్ రామ్ పోతినేని గా తన స్క్రీన్ నేం మార్చుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమా లింగుసామి డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన మూవీతో టాలీవుడ్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న కృతి శెట్టి ఇక్కడ వరుస మూవీస్ తో దూసుకెళ్తుంది. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో కృతి శెట్టి రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తుంది.

ఇక రామ్  సినిమాలో కృతి శెట్టి ప్లస్ అవుతుందని భావిస్తుండగా సినిమాలో మరో హీరోయిన్ అక్షర గౌడని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. రామ్, లింగుసామి కలిసి చేస్తున్న ఈ మూవీలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆదికి జోడీగా అక్షర గౌడ నటిస్తుందని టాక్. తెలుగులో కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 లో అమ్మడు నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకోలేదు.

లేటెస్ట్ గా రామ్  పోతినేని సినిమాలో అక్షర గౌడ ఛాన్స్ అందుకుంది. సినిమాలో ఆమెకు మంచి రోల్ దక్కినట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ మూవీస్ తో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న రాం లింగుసామి మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రామ్, కృతి శెట్టిల పెయిర్ మూవీకి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా రామ్  మరోసారి ఆడియెన్స్ ను అలరిస్తాడని టాక్. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీతో పాటుగా రామ్ మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రామ్ ఇప్పుడు తన కెరియర్ మీద పూర్తి ఫోకస్ తో సినిమాలు చేస్తున్నాడు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: