కెరీర్ ప్రారంభం నుండి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు అల్లరి నరేష్. 'అల్లరి' సినిమా నుంచి ఈ హీరో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్నారు. నరేష్ కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా చాలా బలమైన  సపోర్టింగ్  పాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో విలన్ గా కనిపించిన ఈ హీరో. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'గమ్యం' సినిమాలో శర్వానంద్ కు ఫ్రెండ్ గా గాలి శీను పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.


ఆ తర్వాత 'శంభో శివ శంభో' మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమాలో కూడా హీరో కు సరిసమానమైన పాత్రలలో నటించాడు .తాజాగా కూడా ఇలాంటి పాత్ర ఒకటి చేయడానికి అల్లరి నరేష్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా 'అహం బ్రహ్మాస్మి' కొన్ని వరుస అపజయాలతో డీలా పడిపోయిన మనోజ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా కొత్త రకమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ కథలో హీరో మనోజ్ తో పాటు మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉందట దానినే అల్లరి నరేష్ చేయబోతున్నాడు అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి.


 దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, మంచు మనోజ్ తన సొంత బ్యానర్ అయిన 'ఎమ్ఎమ్‌ ఆర్ట్' పై సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే అల్లరి నరేష్ నటిస్తున్నాడో లేదో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే అల్లరి నరేష్ ఈ సంవత్సరం బంగారు బుల్లోడు , నాంది అనే రెండు సినిమాలలో నటించగా 'నాంది' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. జనాల తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: