ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్
సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తు ఉండగా ఇప్పటికే విడుదలైన అప్డేట్ లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఆ తర్వాత ఆయన హీరోగా చేసిన సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ
సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం ఇంకా తెలియదు.
ఏదేమైనా వరుస పాన్
ఇండియా సినిమాలతో
ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండగా త్వరలోనే ఆయన
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్ కే
సినిమా నీ మొదలుపెట్టనున్నాడని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమా కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుందని తెలిసినా కూడా
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎంతో ఆసక్తి చూపించాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే
హీరో లేని కొన్ని సీన్లను దర్శకుడు తెరకెక్కించగా తాజాగా ఈ చిత్రం కోసం
నవంబర్ నుంచి తన డేట్లను
ప్రభాస్ కేటాయించినట్లు గా తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్
రామోజీ ఫిలిం సిటీ లో అమితాబచ్చన్ పై కొంత జరిగింది. ఆ విధంగా ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టినా
నాగ్ అశ్విన్ నవంబర్ నుంచి
ప్రభాస్ తో కలిసి ఈ
సినిమా షూటింగ్ చేయనున్నాడట. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పడుకునే
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మరింతమంది భారీ
బాలీవుడ్ నటీనటులు ఈ చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది.
సమంత కూడా ఓ కీలక పాత్రలో నటించబోతోందట. మరి
ప్రభాస్ అభిమానులను ఈ దర్శకుడు ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. మరోవైపు
ప్రభాస్ దేశం మొత్తం మెచ్చే సినిమాలను ఎంతో గ్రాండ్ గా చేస్తున్నాడు.