సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'సర్కారు వారి పాట'  సినిమాను ఒక భారీ స్కాం చుట్టూ వినోదాత్మకంగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా మూడవది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ,  ఖాలేజా సినిమాలు రాగా అందులో 'అతడు' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'ఖాలేజా' సినిమా ధియేటర్ల వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఇప్పటికీ టీవీలో మాత్రం జనాలను అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూడవ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ అంటే దీపావళి తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా ఒక పాటతో షూటింగ్ ను ప్రారంభించబోతున్న ట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ సీన్ ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఈ యాక్షన్ సీన్స్ కి డిజైన్ చేయబోతున్నారు అని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: