నందమూరి
బాలకృష్ణ అఖండ సినిమాను తన లక్కీ డేట్ లోనే విడుదల చేస్తుండటం ఇప్పుడు నందమూరి అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. ఆయన హీరోగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ దక్కించుకోవాలని భావిస్తుండగా గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ఈ రోజు ఆ రోజు అని ఊరిస్తూ విడుదల తేదీని జరుపుకుంటూ వచ్చింది. ఫైనల్ గా ఈ చిత్రం దసరా కి విడుదల కావడం లేదని తెలుస్తుంది. దాంతో ఈ
సినిమా విడుదల ఎప్పుడు ఎప్పుడూ ఉంటుందని నందమూరి అభిమానులు ఎదురు చూడసాగారు.
అయితే తాజాగా ఈ చిత్రాన్ని
బాలయ్య లక్కీ డేట్ కే విడుదల చేస్తున్నాం అని తెలియడంతో అభిమానులు ఈ సినిమాతో
బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు.
బాలకృష్ణ హీరోగా నటించిన వంశోద్ధారకుడు
సినిమా ను
జనవరి 5 1996వ సంవత్సరంలో విడుదల చేయగా అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే రోజున అఖండ ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీనికి
బాలకృష్ణ కూడా ఓకే అన్నాడని తెలుస్తుంది. ఏదైతేనేం
బాలకృష్ణ నటిస్తున్న ఈ
సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం ఇప్పుడు అందరినీ ఎంతగానో సంతోషపడుతుంది.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా వీటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని అందరికీ తెలిసిందే. ఇంకొకటి
రాయలసీమ ఫ్యాక్షన్
లీడర్ గా నటిస్తున్నాడు. ఈ రెండు పాత్రలతో
బాలకృష్ణ ప్రేక్షకులను అలరించడం ఖాయం అని తెలుస్తోంది. అఘోర పాత్ర లో
బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడట. ఇప్పటికే వీటికి సంబంధించిన ట్రైలర్ లు విడుదల కాగా సినిమాపై భారీగా హైప్ ను క్రియేట్ చేశాయి ఇవి.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ
సినిమా లోని పాట విడుదల కాగా
యూట్యూబ్ లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.