బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్ ప్రియులు ఎక్కువే ఉన్నారు. స్టార్ హీరో హీరోయిన్లు ఎప్పుడు తమ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. శరీరం ఫిట్‌నెస్‌ను కోల్పోకుండా నిరంతరం వ్యాయామాలు చేస్తుంటారు. బాడీ షేప్ ఛేంజ్ అవ్వడానికి కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. ఫుట్ కంట్రోల్ చేసుకుని హెల్తీ డైట్ మెయిన్‌టెన్ చేస్తుంటారు. అలా వారి శరీరాకృతిని కాపాడుకుంటూ 30-40 ఏళ్ల వయసులోనూ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తుంటారు. జీరో సైజ్ మెయిన్‌టెన్ చేస్తూ ప్రేక్షకులను తమ కళ్ల నుంచి తప్పించుకోకుండా చేస్తారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ కూడా ఉన్నారు. అంత ఏజ్ వచ్చినా.. యువ నటీమణులకు పోటీ ఇస్తుంటారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మాధురి దీక్షిత్‌కు క్రేజ్ ఎక్కువ. ఇప్పుడున్న స్టార్ హీరో హీరోయిన్లు అందరూ మాధురి అభిమానులే. అలనాటి తార శ్రీదేవి తర్వాత అంతటి ఫాలొయింగ్, క్రేజ్‌ను సంపాదించుకున్న నటి మాధురి దీక్షిత్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. నటిగా మంచి గుర్తింపు పొంది.. ప్రేక్షకాభిమానుల ప్రేమను పొందారు. మాధురి దీక్షిత్ ఇప్పటికీ తన శరీరాకృతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఛోళీ కే పీచే క్యా హే.. చునరి కే పీచే.. అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించారు. సినిమాల్లో, ఐటమ్ సాంగ్స్‌లోనూ ఆమె నటించారు. ప్రస్తుతం ఈ భామకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తారు.

మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రీసెంట్‌గా ఒక ఫోటోను అప్లోడ్ చేశారు. ఎరుపు రంగు దుస్తులను ధరించి ఉన్నట్లువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లు చెదిరే అందంతో ఉన్న ఈ ఫోటోను చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 55 ఏళ్ల వయసులో కూడా ఇంత గ్లామరస్‌గా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: