అందరు అనుకున్నదే జరిగింది. అభిమానుల అంచనానే నిజమైంది. బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియాంక సింగ్‌ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది. షో మొదలైనప్పటి నుండి ఈ వారం పింకీ వెళ్లిపోతుంది.. ఇదిగో ఈ వారం పక్కాగా పింకీ వెళ్లిపోతుంది అంటూ సోషల్ మీడియాలో చాలాసార్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అమ్మడు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఫైనల్ గా లాస్ట్ రెండు వారాల ముందు ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ట్రాన్స్ జెండర్ గా అడుగు పెట్టిన ప్రియాంక సింగ్‌..  టాప్‌ 5లో ఊండాలని చాలా ట్రై చేసింది, మొదటినుండి అదే లక్ష్యంతోనే ఆట ఆడుతూ వచ్చింది. కానీ మధ్యలో ఆమె ఫోకస్ బిగ్ బాస్ లోని మరో కంటెస్టెంట్ మానస్ పై మళ్లింది. దీంతో ఆమె అనుకున్న గమ్యానికి చేరుకోలేకపోయింది. కానీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది పింకీ. హౌస్ లో ఉన్నని వారాలు అందరికి వంట చేసి పెడుతూ అందరితో సరదాగా ఉంటూ వచ్చిన పింకీ కి  బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.  

కాగా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెచ్చేటప్పుడు పింకీ బాగా ఎమోషనల్  అయ్యింది. ఇక మానస్ తో మాట్లాడుతూ మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది పింకీ. ఇక ఆమెను సముదాయించడానికి మానస్ ఓ పాట పాడి కూల్ చేస్తాడు. అయితే ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు పింకీ కి బిగ్ బాస్ యాజమాన్యం బాగా నే ముట్టజెప్పిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక సింగ్‌ తో మాట్లాడుకున్న అగ్రిమెంట్ ప్రకారం వారానికి లక్ష 70 వేలు ఇచ్చారట బిగ్ బాస్ టీం. ఈ లెక్కన పింకీ 25 లక్షలు అందిన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత పింకి లైఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: