నిత్యామీనన్ ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది. ఆమెకంటే వెనక వచ్చిన హీరోయిన్స్ ఎన్నో భారీ సినిమాలలో నటిస్తూ కోట్ల రూపాయలలో పారితోషికాలు తీసుకునే స్థాయికి ఎదిగితే నిత్య మాత్రం ఇంకా లక్షల స్థాయిలోనే ఉంది. ఈ 12 సంవత్సరాల వ్యవధిలో ఆమె నటించిన సినిమాల సంఖ్య కూడ 25కు మించవు.


అయితే మంచి నటిగా ఈమెకు మంచి పేరు మాత్రం దక్షిణాది సినిమా రంగంలో ఉంది. తాను నటించే సినిమాలలో గ్లామర్ షోకు అంగీకరించని నిత్య కేవలం మంచి పాత్రలలో మాత్రమే నటిస్తుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ పక్కన ‘భీమ్లా నాయక్’ మూవీలో హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈసినిమాలో ఈమె పాత్ర కేవలం 20 నిముషాలు మాత్రమే ఉన్నప్పటికీ ఆమూవీలో ఆమె పాత్ర చాల కీలకం అని అంటున్నారు.


నిత్య నిర్మాతగా వ్యవహరించిన ‘స్కైలాబ్’ మూవీ ఈమధ్యనే విడుదల అయింది. ఈ సినిమా ప్రమోట్ చేస్తూ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ‘భీమ్లా నాయక్’ మూవీలో తన పాత్ర పై స్పందించింది. తాను నటించే సినిమాలకు సంబంధించి పాత్ర ఏమిటి అన్న విషయం ఆలోచిస్తాను కానీ ఆమూవీలో నటిస్తున్నది చిన్న హీరోనా లేక పెద్ద హీరోనా అన్న విషయం తాను పట్టించుకోను అని అంటోంది.


‘భీమ్లా నాయక్’ లో పవన్ పక్కన అవకాశం ఇమ్మని తాను త్రివిక్రమ్ ను కోరలేదని త్రివిక్రమ్ పట్టుపట్టి ఆపాత్రను తనచేత చేయించాడని ఆమె కామెంట్స్ చేసింది. ‘భీమ్లా నాయక్’ లో తన పాత్ర చాల పొగరుబోతు పాత్ర అనీ త్రివిక్రమ్ ఏరికోరి తనచేత పొగరుబోతు పాత్రలనే ఎందుకు ఎంపిక చేస్తున్నారో అర్థం కావడంలేదు అంటూ తనకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి బహుశా త్రివిక్రమ్ తనకు అలాంటి పాత్రలు ఇస్తున్నారుకాబోలు అంటూ జోక్ చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ‘స్కైలాబ్’ మూవీకి చెప్పుకోతగ్గ స్థాయిలో విజయం కలగకపోవడం ఆమెకు షాక్ ఇచ్చే విషయం అనుకోవాలి..  




మరింత సమాచారం తెలుసుకోండి: