తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఇప్పటివరకు ప్రేక్షకులు ఎప్పుడూ ఊహించని ఈ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు ఒక విలక్షణ నటుడు సిద్ధమైపోయారట. ఆ విలక్షణ నటుడు ఎవరో కాదు మంచు మోహన్ బాబు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి తన నటనతో పాత్రకు ప్రాణం పోసే మోహన్ బాబు ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నారట.


 మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట  అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు ఖలేజా  లాంటి సినిమాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుందట. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 ఇకపోతే ఇప్పుడు ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. మహేష్ సినిమాలో మోహన్ బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. మహేష్ మామయ్య పాత్ర కాస్త నెగెటివ్ షేడ్స్ లో చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఈ పాత్రలో మోహన్బాబు నటించబోతున్నారట. అయితే 1989 లో కృష్ణ హీరోగా  కొడుకు దిద్దిన కాపురం సినిమా లో మోహన్ బాబు విలన్ గా నటించారు. ఇదే సినిమాలో బాలనటుడిగా మహేష్ బాబు నటించగా.. 33 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతు ఉండటం  విశేషం. వీరి కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో అని ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: