జబర్దస్త్ లో పాల్గొని కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ విషయంలో కోత విధించినట్లు గా సమాచారం. ఫలితంగా అందులో ఉండే కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.. అయితే రేటింగ్ పరంగా పెరిగినట్లు అయితే వీరి యొక్క రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో రోజా మినహా మిగిలిన అందరి రెమ్యూనరేషన్లు కోత విధించి నట్లుగా సమాచారం. ఇక ఇందులో పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్ లు, యాంకర్ల సైతం సినిమాలలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం జడ్జి రోజా మాత్రం ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షలు తీసుకుంటోందట. ఇక మరొక జడ్జి మనో మాత్రం 2 లక్షలు ఒక్కో ఎపిసోడ్ కి అందుకుంటున్నారు. ఇక యాంకర్ రష్మి అనసూయ లు మాత్రం 1.50 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక సుధీర్ టీమ్ కు మాత్రం 3 లక్షలు.. హైపర్ ఆది టీమ్ 2.5 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మిగిలిన కంటి స్టెంట్లలలో అందరికీ 2 లక్షల రూపాయల కంటే తక్కువగా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కొంతమంది ఈ షో ని విడి ఇతర వాటిలోకి వెళుతున్నట్లు సమాచారం.