తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పృధ్విరాజ్ కూడా ఒకరు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే తనను మోసం చేసిన వాళ్ల గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు తీసుకున్నానని నాపై మోపిన నింద.. ఏ మాత్రం నిజం లేదని.. అక్కడ ఉండే ఉద్యోగాలు కేవలం ఐదు వేల రూపాయల వేతనం కలిగిన ఉద్యోగాలు మాత్రమేనని.. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు లక్షల రూపాయలు ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు జరిగింది.


తనకు ఎవరి దగ్గర లౌక్యంగా ఉండడం తెలియదని తెలిపారు పృథ్వి. నాయకుడు తనకు వర్క్ ఇస్తే ఆ వరకు ఎంత సిన్సియర్గా చేసాను అనే ఆలోచన మాత్రమే తనకు ఉంటుందని కూడా తెలిపాడు. శత్రువుని కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం తనది అని వెల్లడించాడు. ఇకపోతే సీఎం జగన్ రెడ్డిని కలిసి వివరించే పరిస్థితి లేదని ఆయన కామెంట్లు చేశారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఎద్దుల బండ్లు కట్టుకొని మరి వెళ్లి చూసేవారని తెలిపాడు. ఇక మీడియా ఛానెల్స్ కు అలాగే మీకు కూడా ఒక కుటుంబం ఉన్నది మనసు పెట్టి ఆలోచించాలని తాను సూచించినట్లుగా పృధ్విరాజ్ వెల్లడించారు.


ఏదైనా రిపోర్టింగ్ చేసేవాళ్లను ఎప్పుడు కూడా తను తప్పు పట్టనని అయితే నిజం తెలుసుకొని రిపోర్ట్ చేయడం మంచిది అని.. ఎంత బాధ ఉంటే తను ఆ మాటలు మాట్లాడి ఉంటాను అర్థం చేసుకోమని కూడా తెలిపాడు. కానీ దేవుడికి చాలా దండం పెట్టుకున్నాను కానీ తన మీదే ఎందుకు ఇలా పడి ఏడుస్తున్నారు అలాగే జగన్ పై ఏవిధంగా పడుతున్నారో చూస్తూనే ఉన్నాము. వెనుక ఉంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు ఇది ఒక గేమ్ మాత్రమే అని పృద్వి వెల్లడించారు. ఇక ఈ మాటలు అన్నీ  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: