సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా చిత్రీకరించాడు.  ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ , జీఏంబీ ఎంటర్‪టైన్‪మెంట్ , 14 రీల్స్ ప్లస్  బ్యానర్ లపై  నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.

మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.  తమన్ ఈ సినిమా కోసం అందించిన సాంగ్స్ లో నుండి కొన్ని పాటలను చిత్ర బృందం ఇప్పటికే కొన్ని సాంగ్స్ ని విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో ,  సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.  అందులో భాగంగా  సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.  

తాజా ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు  'సర్కారు వారి పాట'  సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ... సర్కారు వారి పాట మూవీ లో నా క్యారెక్టర్ పోకిరి మూవీ మీటర్ లో ఉంటుంది. మళ్లీ పోకిరి షేడ్స్ తో ఉన్న క్యారెక్టర్ దొరికింది.  పోకిరి మూవీ ని థియేటర్ లో చూస్తే ఒక మాస్ ఫీలింగ్ ఉంటుంది.  అలాంటి క్యారెక్టర్ మళ్ళీ సర్కారు వారి పాట మూవీ లో కుదిరింది. ఈ సినిమాలో కూడా చాలా రిఫ్రెషింగ్ క్యారెక్టర్ ఉంటుంది అని తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: