ఇక ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" ఇంకా అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇంకా అలాగే ఈ సినిమాలు మాత్రమే కాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో "స్పిరిట్", ఇంకా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్టు కే" వంటి సినిమాలు కూడా సైన్ చేసిన ప్రభాస్ పాపం ఓ పరిస్థితిలో టాలీవుడ్ రొట్ట డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ఒప్పుకోవాల్సి వచ్చింది.ఇక "రాజా డీలక్స్" అనే టైటిల్ తో ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇటువంటి ఎంటర్టైనింగ్ సినిమాల్లో చూసి చాలా కాలం అవ్వడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మారుతీపై ప్రభాస్ అభిమానులకి నమ్మకం లేదు. ఫస్ట్ నుంచి కూడా వద్దు బాబోయ్ అంటున్నారు. కానీ అక్కడ ప్రభాస్ కాబట్టి మారుతీ కొంచెం ఒళ్ళు దగ్గర బెట్టుకొని జాగ్రత్తగా సినిమాని తీస్తాడులే అనుకోని సర్దుకు పోయారు.


అయితే తాజాగా మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ ఇంకా రాశిఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటించిన "పక్కా కమర్షియల్" సినిమా మంచి బజ్ తో జూలై 1 న విడుదలైంది. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ప్లాప్ టాక్ ని అందుకొంటూ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను నమోదు చేసుకుంటుంది.కొన్ని కామెడీ సీన్స్ సన్నివేశాలు వర్కౌట్ అయినప్పటికీ సినిమా మాత్రం చాలా చెత్తగా రొటీన్ గా బోరింగ్ గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాగా నిరాశ చెందుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటిదాకా మారుతీ దర్శకత్వం వహించిన పెద్ద హీరోలు నాని ఇంకా వెంకటేష్ మాత్రమే. కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో మారుతి మంచి సినిమా తీయగలడా అని ఇప్పుడు చాలా అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎంత వీలైతే అంత త్వరగా మారుతీ సినిమా క్యాన్సిల్ చేసుకుంటే మంచిదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: