రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది వారియర్. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ నటిస్తుండగా ప్రముఖ హీరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటివరకు మంచి అంచనాలే ఉన్నాయి ప్రేక్షకులలో. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండగా అవి సినిమా పై మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు టీజర్ , ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో రామ్ తనను తాను ఫుల్ మేకోవర్ చేసుకున్నాడని చెప్పొచ్చు. మంచి కథలను పెద్ద దర్శకులను ఎంచుకునే విషయంలో సఫలం అవుతున్నాడు. అందుకే అయన సినిమాలకు ఇంతటి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. దానికోతోడు రామ్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడం కూడా సినిమా పై అంచనాలు ఇంతగా పెరిగాయి. మరి ఈ శుక్రవారం రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ వైబ్స్ వినపడుతున్నాయి.

తాజాగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.దానికి రామ్ తదుపరి సినిమా దర్శకత్వం చేసే బోయపాటి కూడా వచ్చాడు. అయన ఈ సినిమా ప్రమోషన్స్ తోనే సగం విజయం దక్కింది అని చెప్పడం ఈ సినిమా ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. మరి రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే రామ్ బోయపాటి సినిమా కి సంబందించిన పనులు శెరవేగంగా జరుగుతున్నాయి.  రష్మిక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించబోతుంది. మరి ఈ సినిమా తో రామ్ నెక్స్ట్ లెవెల్ హీరో ల సరసన చేరతాడా అనేది చూడాలి. అంతకు ముందు ఈ హీరో వరుస ఫ్లాప్ లతో  సతమతం అవుతూ తన అభిమానులను నిరాశపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: