ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది 'డీజే టిల్లు' సినిమా. సిద్ధూ జొన్నలగడ్డ నటించి న ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు.


ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ మరియు అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివెరీ అన్నీ కూడా ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలనీ చెప్పొచ్చు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమాకి క్లాప్ కూడా కొట్టారు.


త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానుంది. 'డీజే టిల్లు'తో పాటు రాధికా క్యారెక్టర్ కూడా సినిమాలో బాగా పండింది. ఈ పాత్రలో నేహాశెట్టి కనిపించింది. అయితే ఇప్పుడు సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ గా ఆమెను తీసుకోవడం లేదని సమాచారం. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారట.. అయితే నేహాశెట్టి మాత్రం అతిథి పాత్రలో కనిపిస్తుందట. అది కూడా చాలా తక్కువసేపు అని తెలుస్తోంది. 'డీజే టిల్లు 2'లో జరిగే ప్రధానమైన మార్పు ఇదేనని తెలుస్తుంది..


 


పార్ట్ 1లో కనిపించిన పాత్రలు కొన్ని పార్ట్ 2లో కూడా కొనసాగుతాయని తెలుస్తోంది. మరికొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చి చేరతాయట. వాటిలో హీరోయిన్ రోల్ ప్రధానమైనదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ గ్లామరస్ హీరోయిన్ కోసం వెతుకుతున్నార ట. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది.


 


అదేంటంటే.. సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యత లు కూడా చేపడతారనీ సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. దర్శకుడు విమల్ కృష్ణకి వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన సిద్ధూ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్ట్ షురూ అవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. మరి దర్శకుడిగా సిద్దూ తన టాలెంట్ నిరూపించుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: