ఈ మధ్య కాలంలో దర్శకులు తమ ఫేవరెట్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారనే విషయం తెలిసిందే


ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాగా తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందట.. సలార్ సినిమా షూట్ పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్సినిమా పనులను మొదలుపెట్టనున్నారని సమాచారం..


మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. అయితే తారక్ లోని పూర్తిస్థాయి యాక్టర్ ను ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా వాడుకోలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సాధారణ సన్నివేశాన్ని కూడా తన నటనతో మరో రేంజ్ కు తీసుకెళ్లే టాలెంట్ తారక్ సొంతమనే విషయం తెలిసిందే.


 


అయితే ప్రశాంత్ నీల్ తారక్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తారక్ లోని పూర్తిస్థాయి నటుడిని వాడుకునేలా తారక్ నటనను ఊహించని రేంజ్ లో చూపించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రేక్షకులు అంచనాలను పెంచుకున్నా ఆ అంచనాలను కచ్చితంగా రీచ్ అయ్యే కథతో ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోందట..


 


బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులు బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం.. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పనులతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందట.. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కే ఛాన్స్ కూడా ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: