మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఈ తండ్రీకొడుకులు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించినప్పటికీ, అది సినిమాలో ఏదో ఒక సన్నివేశం లేదా ఒక పాటలో కనిపిస్తూ తమ అభిమానులను అలరిస్తు వచ్చారు.

ఇలా సినిమాలో ఒక సన్నివేశం లేదా ఒక పాటలో కనిపిస్తూ వచ్చిన ఈ ఇద్దరు తాజాగా విడుదల అయిన ఆచార్య మూవీ లో మాత్రం చాలా సేపు కలిసి నటించారు. మొదటి నుండి ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు అని తెలియడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అలాగే అపజయం ఎరుగని కొరటాల శివ 'ఆచార్య' మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో, ఆ అంచనాలు భారీ స్థాయికి చేరిపోయాయి. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ లు భారీ మొత్తంలో నష్టాలను కూడా చూడవలసి వచ్చింది.

ఇలా డిస్ట్రిబ్యూటర్ లకు నష్టాలు రావడంతో చిరంజీవి మరియు రామ్ చరణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారు ఆచార్య సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ 20 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్ లకు తిరిగి ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  ఆచార్య మూవీ కి వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం చిరంజీవి , రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: