ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కామెడీ షోస్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది జబర్దస్త్. ఇప్పటికి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది జబర్దస్త్. తర్వాత బుల్లితెరపై ఎన్నో కామెడీ షోస్ వచ్చినప్పటికీ జబర్దస్త్ ను మాత్రం బీట్ చేయలేక పోయాయి అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్ తప్పుకుంటు ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. టాప్ టీం లీడర్లుగా ఉన్న సుడిగాలి సుధీర్ హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఆది జబర్దస్త్ నుంచి తప్పుకుని మిగతా షోలలో కనిపిస్తున్నాడు. కానీ సుధీర్ మాత్రం ఏకంగా ఈటీవీ నుండి తప్పుకొని వేరే ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు.


 గెటప్ శ్రీను, అదిరే అభి సైతం జబర్దస్త్ నుంచి తప్పుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పి జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. దీంతో ఇక మీడియా జబర్దస్త్ లోని మిగతా కమెడియన్స్ దగ్గరికి వెళ్లి పలు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుండి అందరు కమెడియన్స్ వెళ్లి పోవడానికి గల కారణాలు ఏంటో అన్నది ఇప్పటికే జబర్దస్త్ వీడిన అదిరే అభి చెప్పుకొచ్చారు. సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ కాంట్రాక్టు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల ఎంతో మంది కమెడియన్స్ ఈ కాంట్రాక్టు పూర్తి చేసుకున్నారట. ఇక ఎంతో మంది కాంట్రాక్టు పూర్తి అవడం కారణంగానే బయటికి వచ్చేస్తున్నారు అంటూ అదిరే అభి చెప్పుకొచ్చాడు. అయితే కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత జబర్దస్త్ లో ఉండాలా లేదా వేరే ఛానల్ కు వెళ్లిపోవాలా అన్నది ప్రతి ఒక్కరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని.. కొంత మంది కాంట్రాక్టు పూర్తయిన తర్వాత జబర్దస్త్ లో కొనసాగుతుంటే మరి కొంత మంది మాత్రం బయటికి వచ్చేస్తున్నారు అంటూ అసలు నిజం చెప్పేశాడు అదిరే అభి.

మరింత సమాచారం తెలుసుకోండి: