తాన్హాజీ' లాంటి భారీ సినిమా చేసిన తరువాత దర్శకుడు ఓం రౌత్‌.. ప్రభాస్ హీరోగా సినిమా చేస్తున్నారు. అదే 'ఆదిపురుష్'. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు.


అయితే ఈ సినిమా ప్రకటించి రెండేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టారు. అలాంటిది చిన్న ప్రోమోని కూడా లాంచ్ చేయకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అప్సెట్ అవుతున్నారు.


ఈ విషయంలో ఓం రౌత్ టీమ్ ని, 'ఆదిపురుష్' నిర్మాణ సంస్థని తిట్టిపోశారట ప్రభాస్ ఫ్యాన్స్. అయినప్పటికీ 'ఆదిపురుష్' టీమ్ స్పందించకపోవడంతో సైలెంట్ అయిపోయారు ఫ్యాన్స్. ఓం రౌత్ కూడా ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నారట. తాజాగా అతడు అభిమానులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని తెలుస్తుంది.. అక్కడ ఒక భారీ ఐమాక్స్ థియేటర్ ముందు నిలుచుని 2023 జనవరి 12వ తేదీ కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించాడు.


 


ఈ పోస్ట్ ని బట్టి ఆయన 'ఆదిపురుష్' సినిమా పనుల్లోనే ఉన్నారని తెలుస్తోంది. అలానే ఈ సినిమా ముందు అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఓం రౌత్ క్లారిటీ కూడా ఇచ్చినట్లయింది. చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లేకపోవడంతో సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదోననే అనుమానంలో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పుడు రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే. ఇక ఓం రౌత్ అమెరికాలో ఉన్నది 'ఆదిపురుష్' ఐమాక్స్ త్రీడీ వెర్షన్ టెస్టింగ్ కోసమే అని తెలుస్తోంది.


 


ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో.. త్రీడీ-ఐమాక్స్ వెర్షన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన విషయాలు పక్కాగా ఉండేలా ఓం రౌత్ చూసుకుంటున్నారు. ఫస్ట్ కాపీ పక్కాగా రెడీ చేసిన తరువాతే ప్రమోషన్లు మొదలుపెట్టాలని కూడా భావిస్తున్నారు ఓం రౌత్.

మరింత సమాచారం తెలుసుకోండి: