కొంతమంది దర్శకులకు ఎలాంటి బ్యాడ్ లక్ ఎదురవుతుంది అంటే వారికి భారీ విజయం సాధించిన కూడా తదుపరి
సినిమా అవకాశం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా దర్శకుడు
పరశురామ్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట
సినిమా తీసి బంపర్ హిట్ అందుకున్న కూడా ఆయన తన తదుపరి సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.
నారా రోహిత్ హీరోగా నటించిన సోలో సినిమాతో దర్శకుడుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన
పరుశురామ్ మంచి మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు.
అలా గీత గోవిందం
సినిమా తో భారీ విజయాన్ని అందుకొని మహేష్ బాబు కళ్ళల్లో పడ్డాడు. ఆయనకు ఒక మంచి కథ చెప్పి ఒప్పించిన
పరుశురామ్ సర్కారు వారి పాట
సినిమా ఆయనతో చేసి మంచి విజయాన్ని అందజేశారు. కొంతమంది ఈ చిత్రం అంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయిందని కూడా చెబుతూ ఉంటారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన కలెక్షలను బట్టి భారీ స్థాయిలోనే ఈ
సినిమా విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇంతటి మంచి
సినిమా చేసిన తర్వాత
పరశురామ్ కి మంచి
సినిమా అవకాశాలు పెద్ద హీరోల సినిమాల అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
కానీ దానికి భిన్నంగా ఆయన తన తదుపరి సినిమాపై ఇంకా సందేహా పడడం అందరినీ ఎంతగానో నిరాశ పరుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన నాగచైతన్యతో
సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దాన్ని
నాగచైతన్య రిజెక్ట్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక చిన్న హీరోతో
సినిమా చేయడానికి కూడా ఆయన ఇంతగా ఆపోసపాలు పడుతూ ఉండడం నిజంగా ఆయనకు అవమానకరమైన చెప్పాలి. మహేష్ లాంటి దర్శకుడు తో
సినిమా చేసిన ఆయన ఈ చిన్న హీరోతో సినిమాని ఇంకా మొదలు పెట్టకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. మరి ఆయన తన తదుపరి సినిమాను ఏ హీరోతో చేస్తాడో అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగవలసిందే.