రవితేజ హీరోగా నటిస్తూన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు థియేటర్లోకి రాబోతోంది. ఇలా మరికొన్ని గంటలలో ప్రేక్షకులు ముందుకు రాబోతూ ఉండగా ఈ సినిమా నుంచి ఊహించని విధంగా షాక్ తగిలింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుంచి లీకైన వీడియో వైరల్ గా మారుతోంది.


ఇక ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ నెట్టింట వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ కు చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ క్లిప్పింగ్ వీడియోని బట్టి చూస్తే ఇది ఎడిటింగ్ రూమ్ నుంచే సీన్ లీక్ అయినట్లుగా మనకి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో సినిమాపై హైట్ పెంచడానికి చిత్ర బృందం కావాలనే ఈ విధంగా చేసినట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీకైనా సన్నివేశాన్ని గమనిస్తే ఈ సినిమా అధికార పార్టీకి చెందిన రౌడీ మూకలకు రవితేజ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది.



మీరు ఏ పార్టీ వాళ్లకు చెందారో నాకు తెలియదు అధికారంలో ఉన్నాము కదా అని దౌర్జన్యం చేయాలని చూస్తే అంటే వేలు చూపిస్తూ రవితేజ ఒక డైలాగ్ ని చెప్పడం జరిగింది. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ ఒక నిజాయితీ గల పవర్ఫుల్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాల హీరోయిన్లుగా దివ్యాంశ కౌశిక్.. రజిషా విజయన్ నటిస్తున్నారు ముఖ్యమైన పాత్రలు తొట్టెంపూడి వేణు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని రవితేజ బ్యానర్ పై కూడా నిర్మించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి లీకైన సన్నివేశం బాగా వైరల్ గా మారడంతో మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: