ఇక టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఫ్యామిలీ మ్యాన్ అనగానే గుర్తొచ్చే వారిలో ముందుండేది సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీని ఇంకా ఫ్యామిలీ లైఫ్ ను లైమ్ లైట్ కు చాలా దూరంగా ఉంచుతారు.కానీ అప్పుడప్పుడు మాత్రం తన ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో గడిపిన మూమెంట్స్ ని ఆయన పోస్ట్ చేస్తుంటారు. అలా ఇక ఈ రోజు జూ.ఎన్టీఆర్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అదేంటో మీరూ చూసేయండి..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఫుల్ బిజీ అయ్యారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అయి టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫుల్ గా దృష్టి పెట్టారు. ntr 30, ntr 31 సినిమాలను కూడా ఆయన అనౌన్స్ చేశారు.


ఈ సినిమాలను పట్టాలెక్కించడానికి ముందుగానే తన ఫ్యామిలీని తీసుకొని ట్రిప్ కి చెక్కేశారు జూనియర్ ఎన్టీఆర్. తన భార్య ఇంకా ఇద్దరు పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేశారు.ఇప్పుడు తన ట్రిప్ లో ఒక ఫొటోను కూడా తన అభిమానులతో పంచుకున్నారు. తన భార్య ప్రణతితో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ఇద్దరూ కూడా నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ ని బాగా షేక్ చేస్తుంది. తారక్ అభిమానులు క్యూట్ కపుల్ సో క్యూట్ అంటూ ఎన్నో కామెంట్స్ తో ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: