బిగ్ బాస్ హౌస్స్ లో మొత్తానికి కాంట్రవర్సీ క్వీన్ లా తయారైపోయింది గీతూ రాయల్‌ .గేమ్ ఆడుతున్న తీరు విషయంలో ఈమెపై ఎవరు కంప్లైంట్స్ చేయకపోయినా కూడా..ఇంట్లో ఉంటున్న తీరు..
ఆమె వ్యవహరిస్తున్న విధానంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి.
బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రెండు వారాల కింద కేవలం ఒక నార్మల్ కంటెస్టెంట్ గా వచ్చిన గీతూ రాయల్‌ ..ఈ రోజు బిగ్ బాస్ హౌస్ మొత్తానికి కాంట్రవర్సీ క్వీన్ లా తయారైపోయింది. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడం ఈమెకు అలవాటైపోయింది. గేమ్ ఆడుతున్న తీరు విషయంలో ఈమెపై ఎవరు కంప్లైంట్స్ చేయకపోయినా కూడా..ఇంట్లో ఉంటున్న తీరు.. ఆమె వ్యవహరిస్తున్న విధానంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా పెద్దవాళ్లకు కూడా గౌరవం ఇవ్వకుండా తనకు నచ్చినట్టు చేస్తున్న గీతూ రాయల్ పై సోషల్ మీడియాలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే గతవారం ఈమె గేమ్ ఆడిన తీరు అందరికీ నచ్చింది. ముఖ్యంగా నాగార్జున కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతో ఈమెకు కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటూ దారుణమైన విమర్శలు వస్తున్నాయి. తాజాగా మొదలైన దొంగ పోలీసు టాస్క్ లో ఎవరూ ఆట ఆడకుండా..అన్ని తన కంట్రోల్‌లో ఉంచుకోవాలని చూస్తున్న గీతూ ఆట తీరును చూసి అందరూ విమర్శిస్తున్నారు.

ఇంట్లో సభ్యులు అయితే ఇలా ఉంటే.. మిగిలిన వాళ్ళ ఆట ఎలా సాగుతుంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ పవర్స్ గీతూకు ఇచ్చాడు. మామూలుగానే ఆటను తనకు నచ్చినట్టు ఆడే గీతూ.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్‌తో మరింత రెచ్చిపోయింది. మిగిలిన వాళ్ళ ఆటను పూర్తిగా ఆపేస్తూ గేమ్ మొత్తం తన వైపు తిప్పుకుంది. ఈమె ఇలా ఆడితే ఈ వారం కూడా గీతూ బెస్ట్ ప్లేయర్ కావడం ఖాయం.

కాకపోతే బిగ్ బాస్ ఈమెకి ఇచ్చిన అడ్వాంటేజ్ మిగిలిన కంటెస్టెంట్స్ కు కూడా ఇవ్వాలి కదా అనేది అందరూ అడుగుతున్న పాయింట్. ఇవన్నీ చూస్తుంటే కావాలనే గీతూను బిగ్‌బాస్‌ లో హైలెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మొత్తం ఆమె చుట్టూ నడిపితే రేటింగ్ వస్తుందని షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: