ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ సాధారణంగా ఏదైనా సినిమా పూర్తి అయిన తర్వాతనే మరొక సినిమా పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు.అయితే కమల్ హాసన్ తో నటిస్తున్న ఇండియన్ -2 సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. అయితే రామ్ చరణ్ సినిమా కొంత సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల చేత మళ్లీ ఇండియన్ -2 సినిమా పనులతో బిజీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే శంకర్ పని తీరుపై రామ్ చరణ్ ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో కాక వినిపిస్తోంది.


డైరెక్టర్ శంకర్,రామ్ చరణ్ సినిమా కంటే ఇండియన్ -2 సినిమా పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రామ్ చరణ్ కు ఈ విషయం నచ్చలేదన్నట్లుగా సమాచారం.ఇక తన విషయంలో శంకర్ సరిగ్గా దృష్టి పెట్టలేదని రామ్ చరణ్ చాలా ఫీల్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన అందుతుందో చూడాల్సి ఉన్నది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రానికి దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు విచిత్రానికి నిర్మాతగా దిల్ రాజు కూడా వ్యవహరిస్తున్నారు.


ఇక అభిమానులు సైతం ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని భావిస్తూ ఉన్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమా విడుదల డేట్ సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, సునీల్, తదితర నటీనటుల సైతం నటిస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య చిత్రం సక్సెస్ కాలేకపోయింది దీంతో అభిమానులు కాస్త నివాస చెందారు. మరి ఈ సినిమా విజయవంతం అవుతుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: