నందమూరి ఫ్యామిలీ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టారు.
అందులో ముఖ్యంగా, హరికృష్ణ బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్,తారకరత్న లు హీరోగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కళ్యాణ్ రామ్ కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. ఈయన ఈ మధ్యనే వచ్చిన బింబిసార సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు.

అయితే కళ్యాణ్ రామ్ హీరో రవితేజ నటించిన కిక్-2 సినిమా కి నిర్మాతగా వ్యవహరించారు. కిక్-2 సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కొన్ని కోట్ల రూపాయలు నష్ట పోయారట. అంతేకాదు అప్పులు తీర్చలేక తన దగ్గర ఉన్న కొన్ని ఆస్తులు కూడా అమ్మేసినట్లు అప్పట్లో ఓ టాక్ నడిచింది. అయితే రవితేజ ముందు నటించిన కిక్ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో కిక్-2 సినిమా కూడా సక్సెస్ సాధిస్తుంది అని కళ్యాణ్ రామ్ అంచనా వేశారు. కానీ కళ్యాణ్ రామ్ అంచనాలు తారుమారయ్యాయి. కిక్ -2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమాని చాలాసార్లు రీషూట్ చేయడంవల్ల బడ్జెట్ ఎక్కువ అయింది. బడ్జెట్ ఎక్కువ పెట్టినప్పటికీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా కి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాకి వచ్చిన లాభాలతో మిగిలిన అప్పులన్నీ కట్టేసారు కళ్యాణ్ రామ్ . ఇక బింబిసార సినిమాని కూడా తన బ్యానర్ లోనే నిర్మించి మరిన్ని లాభాలు కళ్యాణ్ రామ్ తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: