నందమూరి నాటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఈ మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

కాకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనను వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీ కోసం బాలకృష్ణ అభిమానులు చాలా రోజుల నుండి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతమైన రీతిలో ఉండడంతో , ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: