తక్కువ వయసులోనే సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అందరికి కూడా షాక్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పాపులర్ అయినా కిరణ్ 2019 లో తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు తో వెండి తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా తర్వాత అతడి ట్యాలెంట్ చూసి ఖచ్చితంగా మంచి హేర్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం వచ్చి సైలెంట్ గా గట్టి హిట్ ని కొట్టింది. దాంతో హీరోగా కిరణ్ సెటిల్ అయినట్టే అని అంతా కూడా అనుకున్నారు.

 ఈ సినిమా తర్వాత కిరణ్ తో సినిమాలు చేయాలని చాల మంది వచ్చారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలయ్యిందట.. ప్లాప్ సినిమాలు ఉన్నప్పుడు లేదా స్టార్ గా గుర్తింపు రాని వరకు ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఉండదని సమాచారం . కానీ ఒక్క సాలిడ్ హిట్ కొట్టాక అందరు తననే గమనిస్తూ ఉంటారు. అలాంటి టైం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేయాలో..కానీ గతి తప్పిన పరిస్థితులలో, పక్కన భజన చేసే బ్యాచ్ పెరిగితే ఇక హీరో గా ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుస్తుంది.అచ్చం అలాంటి పరిస్థుతుల్లోనే ఉన్నాడట కిరణ్ అబ్బవరం. 2021 లో కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన కిరణ్ ఆ తర్వాత 2022 లో ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ రాకపోగా కిరణ్ పని అయిపోయింది అని అంతా కూడా అనుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కావాల్సిన చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇక 2023 మొదలయి కేవలం మూడు నెలలు మాత్రమే ముగిసింది. ఈ ఫస్ట్ క్వార్ట్రర్ లో రెండవ నెలలో వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రాన్ని విడుదల చేసిన ఎవరు దాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇక అది విడుదల అయ్యి కేవలం నెల రోజులు గడవకుండానే మీటర్ అనే మరొక సినిమా విడుదల చేసాడు. ఈ చిత్రం ఘోరంగా విఫలం అయ్యిందని చెప్పాలి.. ఇక మీటర్ విడుదల అయినా మూడో రోజే రూల్స్ రంజన్ అనే కొత్త సినిమా కూడా అన్నౌన్స్ చేసాడు. ఇలా గ్యాప్ లేకుండా ఏది పడితే అది తీస్తూ వెళ్తే ఇక పై కిరణ్ అబ్బవరం పేరును అందరు కూడా మర్చిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: