జబర్దస్త్ ద్వారా కామెడీయన్ గా తన కెరియర్ను మొదలుపెట్టి ఆ తరువాత స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన జబర్దస్త్ వేణు ఇప్పుడు ఏకంగా డైరెక్టర్గా మారిపోయారు. అంతేకాదు డైరెక్టర్గా తన సత్తా చాటిన ఈయన మొదటి సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నారు. ఒకప్పుడు సినిమాలలో కమెడియన్ గా కూడా పనిచేసిన వేణు ఇటీవల బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి ఈ సినిమాతో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాడు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో రూ.80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్ట లేక కింద మీద పడుతుంటే చిన్న సినిమాగా వచ్చిన బలగం మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా కళ్ళు చెదిరే స్థాయిలో కలెక్షన్లను అందుకుంది . అంతే కాదు స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేయడం గమనార్హం.

కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా నటీనటుల విషయంలో మాత్రం మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎందుకంటే నటీనటులకు చాలా తక్కువ పారితోషకం దక్కిందన్న వార్త ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. బలగం సినిమాలో నటించిన లలిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమకు ఇచ్చిన రెమ్యునరేషన్ విషయాల గురించి వెల్లడించింది. బలగం సినిమాలో నటించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి చాలా బాధ వేసింది అని చెప్పిన లలిత ఆయనకు సెలబ్రిటీల నుంచి ఇప్పుడు సహాయం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

లలిత మాట్లాడుతూ బలగం సినిమా కోసం వేణు గారు చాలా కష్టపడ్డారు ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఆయన కష్టపడుతూనే ఉండేవారు ఎక్కడ విరామం కూడా తీసుకునేవారు కాదు.. వేణు గారు అసలు విశ్రాంతి లేకుండా ఈ సినిమా చేశారు కాబట్టి ఇదంతా సక్సెస్ అయ్యింది అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే పారితోషకం రోజుకు 5000 రూపాయలు రేంజ్ లో మాత్రమే లభించిందని తెలిపింది లలిత. ఇక ఈ విషయం తెలిసి అన్నీ కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలోని నటీనటులకు పారితోషకం విషయంలో అన్యాయం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: