కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా నటీనటుల విషయంలో మాత్రం మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నటీనటులకు చాలా తక్కువ పారితోషకం దక్కిందన్న వార్త ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. బలగం సినిమాలో నటించిన లలిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమకు ఇచ్చిన రెమ్యునరేషన్ విషయాల గురించి వెల్లడించింది. బలగం సినిమాలో నటించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి చాలా బాధ వేసింది అని చెప్పిన లలిత ఆయనకు సెలబ్రిటీల నుంచి ఇప్పుడు సహాయం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.
లలిత మాట్లాడుతూ బలగం సినిమా కోసం వేణు గారు చాలా కష్టపడ్డారు ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఆయన కష్టపడుతూనే ఉండేవారు ఎక్కడ విరామం కూడా తీసుకునేవారు కాదు.. వేణు గారు అసలు విశ్రాంతి లేకుండా ఈ సినిమా చేశారు కాబట్టి ఇదంతా సక్సెస్ అయ్యింది అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే పారితోషకం రోజుకు 5000 రూపాయలు రేంజ్ లో మాత్రమే లభించిందని తెలిపింది లలిత. ఇక ఈ విషయం తెలిసి అన్నీ కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలోని నటీనటులకు పారితోషకం విషయంలో అన్యాయం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి