ప్రముఖ నటి మలక్ పేట శైలజ ఒక ఇంటర్వ్యూలో నరేష్ గురించి, మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంచు విష్ణు ఈసీ మీటింగ్స్ లో, జనరల్ బాడీ మీటింగ్స్ లో అన్నీ ఓకే చెప్పాడని మంచు విష్ణు మొదట మిస్ గైడ్ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకుని మొదట దానిని ఆపారని శైలజ అన్నారు. మా అనేది గవర్నెమెంట్ సెక్టార్ కాదని పెన్షన్ పాలసీ అని ఇష్టానుసారం ఇచ్చేస్తున్నారని ఆమె తెలిపారు. తండ్రి చనిపోతే కూతురుకు పెన్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదని మలక్ పేట శైలజ చెప్పుకొచ్చారు. జెన్యూన్ గా ఉండేవాళ్లకు మాత్రమే విష్ణు పెన్షన్ ఇచ్చారని శైలజ అన్నారు. కొంతమంది నటీనటులు అవకాశం లేనివాళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పారని ఆమె పేర్కొన్నారు. మనుషులు ఎలాంటి వాళ్లో జనాలకు తెలియదా అని మలక్ పేట శైలజ అన్నారు. మంచు విష్ణు జెమ్ అని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రతి మూడు నెలలకు ఒకసారి విష్ణు మా సభ్యులకు మెడికల్ చెకప్ చేయిస్తున్నారని ఆమె తెలిపారు. మెడికల్ పాలసీకి రూపాయి కూడా తీసుకోకుండా విష్ణు ఇన్సూరెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశారని మలక్ పేట శైలజ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కు మై హోమ్ పక్కన విల్లా ఉందని ఆ విల్లా కొనిస్తానని విష్ణు అన్నారని ఆమె చెప్పుకొచ్చారు. లేదు అంటే రామానాయుడు కళ్యాణ మండపం డీ మాలిష్ చేస్తున్నారని అందులో ఒక ఫ్లోర్ తీసుకోవచ్చని ఏది కావాలో ఛాయిస్ చెప్పాలని విష్ణు అడిగాడని ఆమె చెప్పుకొచ్చారు. అందరూ రామానాయుడు కళ్యాణమండపంలో కావాలని అడగడంతో మా బిల్డింగ్ ఆలస్యం అవుతోందని శైలజ అన్నారు. సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చి మూడు నాలుగు సినిమాల నుంచి తప్పించారని ఆమె చెప్పుకొచ్చారు. పెద్దపెద్ద యాక్టర్లతో కలిసి నేను పని చేశానని మలక్ పేట శైలజ వెల్లడించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: