విజయ్ దేవరకొండ, సమంత హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. లవ్ ,రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న ఖుషి సినిమా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రమోషన్స్ చేయడం జరిగింది.



ఇటీవల ఈ సినిమా థియేటర్లో విడుదలై నెల రోజుల లోపే ఓటీటి లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖుషి సినిమా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి ఛానల్ అయిన  నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలుపడలేదు. కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సమంతకి కూడా సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతున్నప్పటికీ ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.


సినిమా కోసం విజయ్, సమంత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అంటూ ఎదురుచూస్తున్న వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి థియేటర్లో మిస్సయిన ప్రేక్షకుల సైతం ఈ సినిమాని ఓటీటి లో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఓటీటి లో ఖుషి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుంది తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: