ఎయిన్స్టిన్ మీడియా, నెస్ట్లల్ స్టూడియో & అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంథోని. ఈ సినిమాకు జోషి దర్శకుడు, ఎయిన్స్టిన్ జాక్ పాల్ నిర్మాత. సుశీల్ కుమార్ అగర్వాల్, నితిన్ కుమార్, రజత్ అగర్వాల్ సహా నిర్మాతలు.బ్లాడ్ రిలేషన్స్ తో కూడిన ఎమోషన్స్ జర్నీ అంథోని. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. అంథోని సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నవంబర్ 23న

 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో జోజు జార్జ్ మాట్లాడుతూ... " గతంలో నేను ఈ చిత్ర దర్శకుడు జోషి దర్శకత్వంలో వచ్చిన పోరింజు మరియం జోష్ నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంథోని సినిమా కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.ఈ సినిమాకు జెక్స్ బీజాయ్ సంగీతం అందించగా రెనాడివ్ సినిమాటోగ్రఫీ అందించారు, అలాగే శ్యామ్ శశిధరన్ ఎడిటర్ గా వ్యాహరించిన ఈ సినిమాకు ఆర్జె శాన్ క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు అలాగే మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ సంగీత జనచంద్రన్

ఈ మధ్యే జోజు జార్జ్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపించారు. ఇంత వరకు మలయాళీ ప్రేక్షకుల్ని మాత్రమే ఆకట్టుకుంటూ వచ్చిన జోజు జార్జ్.. ఇక పై తెలుగు వారిని కూడా మెప్పించబోతోన్నారు. జోజు జార్జ్ నటించిన ఈ ఆంథోని తెలుగులోకి కూడా రానుంది. ఇక  మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ - శ్రీలీల నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్‌ 24న విడుదలైంది. కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: