![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/vijay-rashmi-combo-rabotundani-anandam-vyaktam-chestunna-fans32fe52c2-09cd-44dd-9f15-fbbe30eb7d78-415x250.jpg)
పలుసార్లు రష్మిక, విజయ్ కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ కూడా బయట కనిపించడంతో.. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రష్మిక మందన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్పా సిక్వెల్ పుష్ప ది రూల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది రష్మిక. ఇక ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరో పక్క విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టొరీ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుందట. అయితే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక గెస్ట్ రోల్ లో కనిపించబోతుందంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ రష్మిక కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.