ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ లో బయటపడ్డ అంశం ఏంటంటే.. పెళ్లి తరువాత నుంచి సామ్ ఒక రకమైన సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆఫర్ వచ్చింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కు వచ్చినట్లే సామ్ కు కూడా ఒక ఆఫర్ వచ్చింది. ఇందులో అవకాశం కావాలంటే తాము ఎక్కడకు రమ్మంటే అక్కడకు రావాలని అడిగారట. అందుకు సమంత కూడా ఓకే చెప్పిందట. ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ లో బయటపడడం.. అధికారుల్లో కొంతమంది నుంచి ఆ సమాచారం అక్కినేని కుటుంబానికి చేరడంతో గొడవ మొదలైందని, అలా స్టార్ట్ అయిన ఈ విబేధాలు చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు దారితీసిందని చెప్పుకొస్తున్నారు. దీని మీద పలు ఛానెల్స్ డిబేట్ కూడా చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మరి ఇందులో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇవేమి పట్టించుకోని సామ్.. తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ తో బిజీగా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్సే ఈ సిరీస్ ను కూడా తెరకెక్కించడం విశేషం.
దీంతోపాటు మరో స్టార్ హీరోయిన్ పేరు కూడా ఇందులో వినిపించడం మరింత షాకిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్కి బలైన వారిలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారనే విషయం పెద్ద దుమారం రేపుతుంది. తమకు అడ్డుగా ఉన్నవారిని, తమకు పోటీగా వస్తున్న వారిని అప్పటి అధికార పార్టీ నాయకులు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారని, అందులో సినిమా సెలబ్రిటీలను కూడా బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నట్టు టాక్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్గా చేస్తుంది. చందూ మొండేటి దర్శకుడు. మరోవైపు సమంత గతేడాది సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. త్వరలోనే ఆమె కమ్ బ్యాక్ కాబోతుందట.