చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , రవితేజ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విరు ఏ మూవీ లలో నటిస్తున్నారు..? అందుకు సంబంధించిన షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష  హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "వార్ 2" అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ముంబై లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తుంది. ప్రస్తుత చిత్రీకరణలో ఉన్న ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కి హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

రాజా సాబ్ : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ప్రభాస్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నీది అగర్వాల్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రజెంట్ లక్నోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: