రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఒకానొక సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించింది. తాను నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో విభేదాల కారణంగా అతి తక్కువ సమయంలోనే దూరమయ్యారు.



విడాకుల తర్వాత చాలా రోజులకి రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీవీ షోలు, సినిమాలలో నటించడం ప్రారంభించింది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ కొద్ది రోజుల క్రితం జరిగిన భారత్ - పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ పై ప్రతీకారంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయ్యింది.

ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్ స్పందిస్తూ పాకిస్తాన్ కు చైనా మద్దతు ప్రకటించడంతో ఈ విషయం పైన మాట్లాడారు. పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ గా ఉన్న కారణంగా ఇకనుంచి ఎవరూ కూడా చైనా వస్తువులను కొనకూడదని రేణు దేశాయ్ అన్నారు. మీరు నిజంగానే దేశం గురించి, శాంతి భద్రతల గురించి ఆలోచించే వారే అయితే చైనాలో తయారయ్యేటువంటి ఎలాంటి వస్తువులను కూడా కొనకూడదు. వాటిని కొనడం పూర్తిగా మానేయండి. ఏ వస్తువు కొన్న దానిపై ఉన్న లేబుల్ ను చూడండి. షాప్ యజమానులకు ఈ వస్తువులు చైనావి అందువల్లనే మేము కొనడం లేదని వారికి తెలియజేయండి అని సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: