ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజులలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ను అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలు కోసం ఏపీ ప్రజలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈకేవైసీ పూర్తీ చేసిన రైతులకు మాత్రమే ఈ నగదు జమ కానుంది. ఇప్పటివరకు ఈకైవైసీ పూర్తీ చేస్తే మాత్రమే నగదు జమ కానుండటంతో పూర్తీ చేయని వాళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

అన్నదాత సుఖీభవ స్కీమ్  విషయంలో ఏపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతల్లో ఈ స్కీమ్  నగదు ఖాతాలలో జమ కానుంది.  పీఎం కిసాన్ స్కీమ్  నగదు ఎప్పుడు రైతు ఖాతాలలో జమవుతుందో ఈ స్కీమ్  నగదు కూడా అప్పుడే రైతుల ఖాతాలలో జమ కానుందని సమాచారం అందుతోంది. తొలి  విడతలో 7,000 రూపాయలు జమ కానుండగా ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు జమ చేయనుంది.

అన్నదాత సుఖీభవ  వాళ్ళ రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.     రైతులు ఈకేవైసీ పూర్తీ చేయని పక్షంలో  వాళ్ళ ఖాతాలలో ఒక్క రూపాయి కూడా జమ కాదని చెప్పవచ్చు. రైతులు ఈ విషయాల గురించి  పూర్తిస్థాయిలో అవగాహనా కలిగి ఉంటె మంచిది.   అన్నదాత సుఖీభవ వల్ల  రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం  చేకూరనుందని చెప్పవచ్చు.

అన్నదాత సుఖీభవ  స్కీమ్  గురించి ఏవైనా సందేహాలు ఉంటె  సమీపంలోని  సంప్రదిస్తే మంచిది. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ ద్వారా ఈ పథకానికి అర్హత ఉందో  లేదో కూడా తెలుసుకోవచ్చు.  అన్నదాత సుఖీభవ స్కీమ్  బెస్ట్ స్కీమ్  అవుతుందని చెప్పడంలో  సందేహం  అవసరం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: