గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ పేరు ఎలా మారుమ్రోగిపోతుంది  అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  దిల్ రాజు బ్రదర్ శిరీష్ ప్రొడ్యూసర్ . అలా ప్రొడ్యూసర్ వరకే ఇన్నాళ్లు ఆయన పరిమితమయ్యారు . తెరపైన ఎక్కువగా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు . రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.   ఆయన మాట్లాడిన మాటలు చూసి కోట్లాదిమంది ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోయారు.  దమ్ము - నీతి - నిజాయితీ ఉన్న వ్యక్తి అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు .

కాగా దిల్ రాజు బ్రదర్ శిరీష్ మాటల సందర్భంలో "గేమ్ ఛేంజర్" సినిమా ఫ్లాప్ అయితే రాంచరణ్ పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చాడు . దీంతో ఒక్కసారిగా మెగా ఫాన్స్ ఫైర్ అయిపోయారు.  అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆయనకి వార్నింగ్ ఇచ్చారు . అంతేనా సోషల్ మీడియాలో ఒక లెటర్ షేర్ చేస్తూ సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇస్తూ ఆరు పాయింట్ లో ఉన్న పేజీని వైరల్ చేశారు.  దీంతో ఎట్టకేలకు దిల్ రాజు ఈ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు .

ఇక వల్ల కాదు అనుకోని శిరీష్ రెడ్డి ఓపెన్ గానే బహిరంగంగా క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు . "నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా రామ్ చరణ్ ఫాన్స్ ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి " అంటూ ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు.  దీనితో పరిస్థితి అంతా సర్దుమనిగేలా నే సిచువేషన్ వచ్చింది . అయితే ఈ గొడవలో శిరీష్ ఇమేజ్ డామేజ్ అవ్వడం రాంచరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడడం జరిగిన రామ్ చరణ్ "పెద్ది" సినిమాకి మాత్రం మంచి క్రేజ్ పబ్లిసిటీ వచ్చేసింది. రామ్ చరణ్ కచ్చితంగా ఈ "పెద్ది" సినిమాతో హిట్టు కొట్టి ఇలాంటి వాళ్ళ నోర్లు మూయిస్తారు అని మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో పెద్ది సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . వాళ్ళు వాళ్ళు  కొట్లాడుకొని బుచ్చిబాబు సనా  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  "పెద్ది" సినిమాని  మాత్రం హైలెట్ చేసేసారు . సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి . చూడాలి మరి ఈ "పెద్ది" సినిమా రామ్ చరణ్ కి ఎలా కలిసి వస్తుందో..???

 

మరింత సమాచారం తెలుసుకోండి: