ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు చక చకా పెళ్లిలు చేసేసుకుంటున్నారు. బడా స్టార్ హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు . రీసెంట్గా ఆ లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది కృతిసనన్. ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి సనన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిసనన్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలుసు. ఆది పురుష్  సినిమాలో  ప్రభాస్ కి జోడిగా నటించి సీత క్యారెక్టర్ లో  మెప్పించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది .


తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో సెల్ఫీ దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్ఆర్ఐ బిజినెస్మేన్ కబీర్ బహియాతో కృతి సనన్ డేటింగ్ చేస్తుందనే వార్త గత కొంతకాలంగా ట్రెండ్ అవుతుంది . ఈ వార్త చాలా చాలా పాతది . అయితే మొన్నటి వరకు కృతి సనన్ దీనిపై ఎక్కడా కూడా అఫిషియల్ గా ప్రకటించలేదు . ఇంకా తాను లవ్ లో లేను అంటూ అటూ ఇటూ బుకాయిస్తూ వచ్చింది . కానీ ఇప్పుడు మాత్రం మెల్లమెల్లగా బయటపడుతుంది . ఎంతలా అంటే అతగాడితో సెల్ఫీ దిగింది .



ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి విదేశాలలో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. లార్డ్స్ స్టేడియంలో వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ కి వెళ్లారు.  డిన్నర్ డేట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ ఫోటోతో తాను సింగిల్ కాదు అని చిన్నపాటి క్లారిటీ ఇచ్చేసింది . బిజినెస్మేన్ కబీర్ బహియా వారసత్వంగా వచ్చిన ట్రాల్లెల్ అండ్ టూరిజం బిజినెస్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.  లండన్ లో ఉన్న ఈయన వ్యాపారాలు  తాజాగా సౌదీకి కూడా విస్తరించాడు.  ఓవైపు బిజినెస్ లతో హడావిడిగా ఉంటూ మరో పక్క కృతి సనన్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ విల్ వీళ్ల లవ్ మేటర్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది . అప్పట్లో కృతి  సనన్ - ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. అవ్వంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది కృతి సనన్..!

మరింత సమాచారం తెలుసుకోండి: