
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ డ్రామా సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్తో కూడిన సెట్లు, టెక్నికల్ టీమ్ను సిద్ధం చేస్తూ, అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు తన స్వంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్లో సందీప్ ఓ చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన వేణు అనే యువకుడిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ను ఎంచుకున్నారు. తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుండగా, త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ ప్రాజెక్ట్పై పరిశ్రమ మొత్తానికి దృష్టి పడుతుంది. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఆయన ముద్ర వుంటుందని అందరికీ తెలుసు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు