ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభారాజు మాట్లాడుతూ.." సమంత కోడలిగా రావడం మా కుటుంబానికి ఎంతో అదృష్టం. సమంత చాలా మంచి అమ్మాయి, పద్ధతిగా ఉంటుంది.పెళ్లి చీరలో చాలా చూడముచ్చటగా ఉందంటూ" తెలియజేసింది. ఆమె రాజ్ జీవితంలోకి రావడం మాకు మరింత ఆనందంగా ఉందని తెలియజేసింది. అలాగే రాజ్ కు పాటలు పాడడం చాలా ఇష్టం. భక్తి కూడా ఎక్కువ అంటూ తెలియజేసింది. సమంత కి కూడా ఆధ్యాత్మిక మార్గంపై చాలా ఆసక్తి ఉంది అంటూ తెలిపింది శోభారాజు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. యోగా సెంటర్ లో సమంతను రెండుసార్లు కలిశాను.. ఆమె చూడడానికి చాలా సన్నగా ఉంది.. దీంతో సన్నగా అవ్వాలంటే ఎలా? అని ఆమెను డైట్ టిప్స్ అడగగా.. కొన్ని వర్కౌట్స్ చెప్పింది. కానీ వాటిని చేయడం నావల్ల కాదని వదిలేసానని తెలిపాను అంటూ శోభ రాజు తెలిపింది. కానీ ఈషా ఆశ్రమంలో మౌనం పాటిస్తూ సాధన చేయడం ఆనందంగా ఉంటుందని తెలిపింది..రాజ్ ఎక్కువగా తన తల్లి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువగా పెరిగారని, అందుకే చిన్న వయసు నుంచే ఎక్కువగా సంగీతం నేర్చుకున్నారని తెలిపింది. శోభారాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శోభారాజు 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది.. శోభారాజు అక్క రమాదేవి కుమారుడే రాజ్ నిడిమోరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి